జగిత్యాల : దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వెల్గటూర్, కుమ్మరి పల్లి, శానబండ, గొడిశలపేట గ్రామాలలో రైతు వేదికలు, పల్లె ప్రకృతివనం, సీసీ రోడ్లలను ప్రారంభించి మాట్లాడారు. దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందన్నారు. రైతు వేదికలు రైతులకు అధ్యయన కేంద్రాల వంటివని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లు ఖర్చు చేసి 2,601 రైతు వేదికలను నిర్మించామని, ప్రపంచంలో ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించడం తెలంగాణలో మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. రైతు భూ హక్కులను సంపూర్ణంగా రక్షించేందుకువారికి ఉన్న సమస్యలు తొలగించేందుకు వీలుగా ధరణి పోర్టల్ రుపొందించామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక వైఖరి అవలంభిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి సీఎం కృషి చేస్తుంటే నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్రం రైతులను గందరగోళానికి గురి చేస్తుందని విమర్శించారు. రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో 54 రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తి చేసామని తెలిపారు. ప్రతి వ్యవసాయ క్లస్టర్ లో వ్యవసాయ విస్తరణ అధికారి విధులు నిర్వహిస్తున్నారని, రైతులకు అవసరమైన సలహలు సూచనలు అందిస్తారని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
72 టీఎంసీలకు చేరిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన