T-Works | దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్పై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఆసక్తికర ట్వీట్ చేశారు. వైవిధ్యమైన కొత్త ఆలోచనలకు కార్యరూపం ఇవ్వనున్న టీ వర్క్స్ను తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఇవాళ హైదరాబాద్లో ప్రారంభించింది. అధునాతన ఉత్పత్తుల తయారీ రంగంలో ప్రపంచానికి భారత్ గమ్యస్థానంగా మారేందుకు టీ వర్క్స్ ఎంతో దోహదపడుతుందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్లో పేర్కొన్నారు.
Being launched today in Hyderabad by the Telangana Govt. Will help move India more rapidly down the path of becoming the world’s preferred manufacturing destination. 👍🏽👍🏽👍🏽 pic.twitter.com/Im0KiO7Zjd
— anand mahindra (@anandmahindra) March 2, 2023
హైదరాబాద్ రాయదుర్గం ఐటీ కారిడార్లో 18 ఎకరాల్లో అత్యాధునియ సదుపాయాలతో టీ వర్క్స్ను నిర్మించారు. ఈ టీ-వర్క్స్ను ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 200కు పైగా అత్యాధునిక యంత్రాల కోసం రూ.110 కోట్లు వెచ్చించారు. మరో రూ.40 కోట్ల వరకు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే అవకాశం ఉంది. టీ-వర్క్స్ మొదటి దశ 78 వేల చదరపు అడుగుల్లో ఉంది. ఇందులోనే ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, సోర్సింగ్, మెటీరియల్స్, ఇతర అంశాలపై టీ-వర్క్స్లో నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరిస్తారు.