తిరుపతి : తిరుమలలోని శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను శుక్రవారం తిరుమలలోని గోశాలలో టిటిడి ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ముందుగా అగ్నిహోత్రం, శంఖునాదంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీవారి చిత్రపటానికి పూజలు చేశారు. నాలుగు కుండల్లో పెరుగు నింపి సంప్రదాయబద్ధంగా కవ్వాలతో చిలికారు. కాగా, ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం నుంచి శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం కానుంది.
దేశవాలి ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను, పెరుగుగా మార్చి దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకెళ్లి అర్చకులకు అందిస్తారు.
కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ హరీందర్ నాథ్, లోకనాథం, టిటిడి బోర్డు మాజీ సభ్యులు శ్రశివకుమార్, దేశీయ వ్యవసాయ పరిశోధకుడు విజయరామ్, చిరుధాన్యాల ఆహార నిపుణుడు రాంబాబు, గోశాల వెటర్నరీ డాక్టర్ డా.నాగరాజు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మల్లన్న సాగర్ను చూసి మురిసిపోయిన సీఎం కేసీఆర్
Kabul Blasts: శరీర భాగాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.. మురికి కాలువలో రక్తం పారింది!
Sonu Sood: సోనూ సూద్ విన్యాసాలని చూసి ముక్కున వేలేసుకున్న నెటిజన్స్
అసోంలో 7 వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు మృతి