Adibatla kidnap case | మధ్యాహ్నం నుంచి టెన్షన్ పెట్టిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. యువతి కిడ్నాప్కు గురైన కొద్దిగంటల్లోనే నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. నవీన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. బాధితురాలు వైశాలిని రక్షించారు.
నిందితులను అరెస్టు చేయడానికి ముందు కిడ్నాపైన యువతి తన తండ్రి ముచ్చర్ల దామోదర్రెడ్డికి ఫోన్ చేసింది. తాను సిటీలో ఉన్నానని తెలిపింది. తాను క్షేమంగానే ఉన్నానని.. తన గురించి ఆందోళన చెందవద్దని పేర్కొంది.
రాగన్నగూడకు చెందిన ఓ యువతి బీడీఎస్ పూర్తి చేసింది. ఆమెకు ఇంట్లో పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం పెండ్లి చూపులు ఏర్పాటు చేయగా.. నవీన్ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి సదరు యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం యువతిని బలవంతంగా లాక్కెళ్లారని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. కొద్దిగంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు.
Read Also : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 100 మందితో వచ్చి ఇంటిపై దాడి.. యువతి కిడ్నాప్