నిజామాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలోని బాల్కొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ సీహెచ్ కిషన్, తోట గంగాధర్, భూమయ్య, మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మధుతో పాటు రాహుల్, సతీష్, నర్సయ్య, పెండెం సత్యనారాయణ పలువురు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతు, పేదల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఇవాళ బాల్కొండ మండలానికి చెందిన వివిధ పార్టీల సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ బద్దం ప్రవీణ్ రెడ్డి, సీనియర్ నాయకులు తౌటి గంగాధర్, లింగా గౌడ్, డా.ప్రసాద్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్