రాజన్న సిరిసిల్ల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 65 మంది యువ నాయకులు నవాబ్ అధ్వర్యంలో మంగళవారం టీఅర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మండల రైతుబంధు సమన్వయ సమితి కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్ రావు, ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, శ్రీనివాసులు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడకు నిరసనగా పార్టీని వీడి నట్లు నవాబ్ తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తతులు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
లఖింపుర్ ఖేరి ఘటనపై మంత్రి కేటీఆర్ షాక్
Crime news |ఐలాపూర్ చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
విహారంలో విషాదం..నీటిలో మునిగి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి