కాసర్గోడ్, జూలై 25: కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) హ్యాకింగ్ అంశం కలకలం రేపింది. ఇది తీవ్రమైన నేరమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు రాజ్మోహన్ ఉన్నితన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈవీఎంలను హ్యాక్ చేసినట్టు చెప్పుకుంటున్నది ఓ కాంగ్రెస్ నేత కావడం గమనార్హం. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం నిజమైతే ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్య అని ఉన్నితన్ పేర్కొన్నారు. కాసర్గోడ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ అంశాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంగా చూడరాదని అన్నారు. ఎవరు దోషులుగా తేలినా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు.