ములుగు : పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శుక్రవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్టు, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్, పిసిసిఎస్ శోభ, అదనపు పిసిసిఎఫ్ మోహన్ చంద్ర ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్నారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ములుగు, భూపాల పల్లి, వరంగల్, మహబూబాబాద్, జిల్లాలకు సంబంధించిన పోడు భూములు సమస్యలు, అడవుల పరిరక్షణ, హరితహారం అంశాలపై ఆయా జిల్లాల జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలో, అటవీశాఖ అధికారులు, డీఎఫ్వోలు, రెవెన్యూ,గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న అటవీ భూములను పరిరక్షించాల్సిన భాద్యత అధికారులదేనన్నారు. ములుగు, భూపాల పల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువ గా ఉందన్నారు. ఇక నుంచి ఎకరం కూడా అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాకుండా చూడలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ గిరిజన సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి గతంలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేసిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఇంకా ఎంత మందికి ఎన్ని ఎకరాలకు పట్టాలు అందించాలనే దానిపై సమగ్ర సమాచారం అందించాలన్నారు.
పోడు సాగుదారులకు న్యాయం చేయాలనే అంశాలపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, దానికి దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్టు మాట్లాడుతూ..పోడు భూముల అడవుల సంరక్షణ హరితహారం సంబంధిత విషయాలపై ప్రభుత్వ నియమ నిబంధనలు ఆర్ వో ఎఫ్ ఆర్ యాక్ట్ లో ఉన్న అంశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.
ఈ సందర్భంగా సీఎం ఓస్డీ ప్రియాంక మాట్లడుతూ.. పోడు భూముల విషయంలో ప్రజలను ఇబ్బదులకు గురిచేయొద్దన్నారు. ప్రజలకు నచ్చజెప్పి వారి జివనోపాధికి ఇబ్బంది లేకుండా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నారు. సమావేశంలో ములుగు, భూపలపల్లి, వరంగల్, మహబూబాబాద్, జిల్లాల కలెక్టర్లు, ఎస్. కృష్ణ ఆదిత్య, గోపి, శాశాంక, తదితరు లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Burj Khalifa | రేపు దుబాయిలోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన
తన పోలికలతో పుట్టలేదని పసిబిడ్డను హతమార్చిన తండ్రి
Tirupati | 30, 31 తేదీల్లో తిరుపతిలో ప్రకృతి వ్యవసాయంపై సదస్సు