తిరుపతి : తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్ తెలిపారు.
ఈ సదస్సులో పాల్గొనాలనుకునే వారు ఈనెల 28లోగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040-27654347, 6309111427 ఫోన్ నెంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంలో దేశీయ ఆవుల ఆవశ్యకత, దేశీయ విత్తనాలను కాపాడుకోవడం, ఐదు వరుసల పంటల పద్ధతి, తదితర విషయాలపై వక్తలు అవగాహన కల్పిస్తారని వివరించారు.