KCR | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ అంటేనే ఓ చరిత్ర అని, దానిని ఎవరూ తుడిపేయలేరని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. ‘టీవీ9’కు మంగళ వారం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పా రు. పార్లమెంటు ఎన్నికల్లో భంగపాటు తప్పదన్న ఫ్రస్ట్రేషన్ కాంగ్రెస్లో కనిపిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న వికృత క్రీడ వెనక ముఖ్యమంత్రి, ఆయన ముఠా ఉన్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇక కనుమరుగేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై స్పం దిస్తూ.. పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కనుమరుగైందా? అని ప్రశ్నించారు.
జవాబు: ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు టెంప్ట్ అవడంతో వాళ్లకు మాకంటే 1.8 శాతం ఎక్కువ ఓట్లు వేయడం ద్వారా అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రజలు గాయపడ్డారు. రైతాంగం విలవిలలాడుతున్నది. ఏ కోణంలోనూ పరిస్థితులు సరిగా లేవు. ఇప్పుడు రాష్ట్రంలో ‘దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు’ మాత్రమే నడుస్తున్నది. ముఖ్యమంత్రి, ఇతరులు వాళ్లు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక విలవిల్లాడుతున్నారు. కాంగ్రెస్ సభలు అట్టర్ ఫ్లాప్ అవుతుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, భంగపాటు తప్పదని ఫ్రస్ట్రేషన్తో ఇలా చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా తన వికృత రూపాన్ని చూపిస్తున్నది. మీడియాలో ఉన్న ఒక సెక్షన్ వికృత రూపం, విశృంఖలత్వం, విచ్చలవిడితనాన్ని సమాజం చూస్తున్నది. 18 రోజుల్లోనే రూ. 700 కోట్ల బీర్లు తాగేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ బాకా, కాకా చానళ్లు, కొన్ని విషం చిమ్మే పత్రికలు నేను అధికారంలో ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితే ప్రజలను తాగుబోతులు చేస్తున్నరని అన్నరు. ఇప్పుడు బీర్ల అమ్మకాలు పెరిగితే ఎండతాపం వల్ల ప్రజలు తాగుతున్నరు అని సమర్థించే ప్రయత్నం చేస్తున్నరు.
జవాబు: గతంలో విలీనం చేస్తామని చెప్పిన మాట వాస్తవం. నేను చెప్పిన మాట వారు వినని మాట వాస్తవం. తెలంగాణ ఏర్పాటుకు జూన్ 2ను అపాయింటెడ్ డే పెట్టారు. అయితే రెండు రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత ఉమ్మ డి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంపై నేను అభ్యంతరం చెప్పాను. ఇది తలాతోక లేని వ్యవహారం అని చెప్పినా వాళ్లు వినలేదు. తదనంతరం నేను విలీనం చేయడానికి ఒప్పుకోలేదు.
జవాబు: మీకు అలా అనిపిస్తుంది. కానీ నేను అసలు లెక్క చేయడం లేదు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు. ఒక ఇన్స్టిట్యూషన్. శూన్యంలో నుంచి సునామీ సృష్టించా. దిక్కుతోచని పరిస్థితిలో మన బతుకులు ఇక ఇంతేనా అన్నట్టు ఉన్న తెలంగాణ ప్రజల కోసం స్వయంగా ఒక పార్టీని స్థాపించి, ఆ పార్టీని ఒక మహా సుడిగాలిగా, మహోధృతమైన ఉద్యమ రూపంలో నడిపి, అనుకున్న లక్ష్యాన్ని సాధించా. తదనంతరం పదేండ్లు కులం, మతం, జాతి, వివక్ష లేకుండా పాలించా. రాజకీయ నాయకులు కొన్ని విషయాలను ప్రజల్లోకి ప్రబలంగా తీసుకుపోవాలనుకున్నప్పుడు కొంత ఉద్వేగంతో, వ్యంగ్యంతో మాట్లాడుతారు. అలా ఆ రోజుల్లో సమైక్య వాదులు నామీద చేసే దాడికి ప్రతిగా కొంత వ్యంగ్యం కూడా కలిపి మాట్లాడేవాడిని. చాలామంది నేను ఆంధ్రాప్రాంత వ్యక్తులకు వ్యతిరేకం అని అనుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత దివంగత పొత్తూరు వెంకటేశ్వర్రావు ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘ఉద్యమకారులు పాలకులుగా విజయవంతం కాలేదు. రాజ్యం నడపలేదు. బ్రిటన్లో విన్స్టల్ చర్చిల్ కూడా వార్టైం బెస్ట్ పీఎంగా ఉండేవారు. ప్రభుత్వం నడపలేక విఫలమై ఓడిపోయారు. మీరు కూడా అలాగే అయిపోతరని అనుకున్నం. కానీ మీ ప్రవర్తన, పద్ధతి చాలా భిన్నంగా ఉన్నది’ అని నాతో చెప్పారు. పదేండ్లలో ఇతర రాష్ర్టాలకు చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఇసుమంతైనా బాధపడలేదు.
ఆ పరిస్థితి రానీయలేదు. ఎందుకంటే, తెలంగాణ మీద తెలంగాణ ప్రజలకు అధికారం కావాలి. తెలంగాణ వనరుల మీద, తెలంగాణ ఉద్యోగాల మీద, తెలంగాణ నదుల మీద, హక్కుల మీద, మా రాజ్యం మాకు ఉండాలని కోరుకున్నం. అది వచ్చేసింది. శంషాబాద్లో ఇప్పుడు రోజూ 500 విమానాలు రాకపోకలు జరుగుతాయి. వందల రైళ్లు వస్తుంటయి. అందులో నుంచి తెలంగాణవాళ్లే దిగాలంటే ఎలా? దానికి రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానిని ఎలా ముందుకు తీసుకుపోవాలని ఆలోచించాలే తప్ప వికృతమైన వ్యతిరేక భావన, అసహజమైన వ్యతిరేక భావన పెట్టి, మనుషుల మధ్య గోడలు కట్టడం కరెక్ట్ కాదు. తెలివైన పని కాదు. అందుకోసం చాలా సంయమనంతో, చాలా బాధ్యతతో, కొన్ని సందర్భాల్లో కొన్ని విమర్శలు వచ్చినా, వాళ్లకు కూడా సర్దిచెప్పి, రాష్ర్టాన్ని పదేండ్లు అద్భుతంగా ఒక చిన్న మత కల్లోలం లేకుండా అద్భుతమైన లా అండ్ ఆర్డర్తో చాలా గొప్పగా తీసుకుపోయినం. ప్రభుత్వం అంటే అట్లా నడపాలి. తిడుతూ కాదు. మూడుకోట్ల మందిలో ఓట్లలో కోటిమందికిపైగా మాకు ఓట్లేశారు. అంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు. అనుకోకుండా జరిగిన సంఘటనలో ఏదో గ్యాప్లో మీకు అధికారం వచ్చింది. ఆ అధికారం కూడా ఎందుకు ఇచ్చారో అర్థం చేసుకోకుండా శ్వేతపత్రాల నుంచి మొదలుపెట్టి ఐదు నెలల కాలాన్ని వృథా చేశారు. ప్రజలను గాలికి వదిలేసి, వాళ్ల ఖర్మానికి వదిలేసి, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ఒకటే రొడ్డ కొట్టుడు. దీంతో జనం విసుగెత్తిపోతున్నరు.
జవాబు: తప్పులు జరిగితే కదా. తప్పులు అంటే ఊదరగొట్టుడా? ప్రచారమా? మీడియాలో లాబీ చేసేవాళ్ల ద్వారా పిచ్చిరాతలు రాయించడమా? తప్పు అంటే ఎంక్వైరీ జరగాలి, రుజువు కావాలి.
జవాబు: కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. నో బడీ కెన్ వైప్ ఇట్. కేసీఆర్ను తగ్గిద్దామని చాలామంది, చాలా ప్రయత్నాలు చేసి, భంగపడి విఫలమయ్యారు. నేను పెరగాల్సిన ఎత్తు పెరిగాను. నన్ను తగ్గించడం అంటూ ఉండదు. ఇది కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న ఒక రాజకీయ వికృత క్రీడ దీని వెనుక ముఖ్యమంత్రి, ఆయనను ఎన్నుకున్న ముఠా ఉన్నది.
జవాబు: వాళ్లు అజ్ఞాన, అహంకారపూరిత పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తాం అని శాసనసభలో సీఎం మాట్లాడారు. ఇది సాధ్యమేనా? అసలు ఆ ఆలోచనే ఎంత వికృతమైనది. కాంగ్రెస్ పదేండ్లు అధికారానికి దూరంగా ఉంది కదా. కనుమరుగయ్యిందా? ఎవరైనా వాళ్ల సమయం కోసం ఎదురు చూస్తరు. ప్రజల ఆలోచన సరళిలో మార్పు వచ్చినప్పుడు కచ్చితంగా వారి టైం వస్తది. అంతేగానీ కృత్రిమంగా, వికృతంగా చేసే ఆలోచనలు, ఇలాంటి ప్రయత్నాలు బెడిసికొడుతాయి. చరిత్రలో సక్సెస్ కాలేదు. కావు.
జవాబు: కాంగ్రెస్ వాళ్లు మాపై మొదట చేసిన ఆరోపణ అప్పులు. లంకెబిందెలు ఉన్నయనుకున్నం అంటూ ఏదేదో చెప్పా రు. ప్రపంచంలో ధనిక దేశం అమెరికా. అత్యధిక అప్పులు ఉన్న దేశం కూడా అమెరికానే. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 27 ట్రిలియన్ డాలర్లు, చైనా 18,566 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ, జపాన్, భారత్ 4 ట్రిలియన్ డాలర్లతో ఉన్నాయి. దేశంలో జీఎస్డీపీతో పోల్చితే రాష్ట్రం 24వ స్థానంలో ఉన్నది. అంటే మనకన్నా 23 రాష్ర్టాలు ఎక్కువగా అప్పు లు ఉన్నాయి. ఒక వ్యక్తికి కొంత ఆదాయం వస్తే దానికి తగ్గటట్టుగా భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటారు. ప్రభుత్వంలో మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలు తీర్చే అవసరాల కోసం ముందుగా ప్లాన్ ముందుగా తయారవుతుంది. ప్లాన్కు తగ్గట్టుగా నిధుల కూర్పు జరుగుతుంది.