హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతికనిచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే.. అప్పటి పరిస్థితులను బట్టి తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. మంగళవారం ఆయన టీవీ 9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందనే వార్తలను తోసిపుచ్చారు.
జవాబు: ఈజీగా.. దానికి పెద్ద ఇష్యూ ఏమున్నది? నేను జ్యోతిష్యం చెప్పలేను కానీ, దేరీజ్ ఎవరీ పాసిబులిటీ. నేను చెప్పిన లాజిక్ ఏందంటే.. 119లో మాకు 111 సీట్లు ఉంటేనే బీజేపోళ్లు వచ్చి ఇక్కడ దుకాణం పెట్టిండ్రు. ఈ 64 మంది ఉన్న కాంగ్రెస్ను వీళ్లెక్కడ బతికనిస్తరు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత అతి కొద్ది సమయంలో అదే జరుగుతుంది. మాకు వస్తున్న సమాచారం ప్రకారం కుండబద్దలు కొడుతున్నా. హిమాచల్ప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ బొక్క పెట్టేసింది. ఎన్నికల తర్వాత పది రోజులకో, పదిహేను రోజులకో ఫినిష్, ఢామ్. నరేంద్రమోదీ బాంబు పడ్తది. కర్ణాటకలో మరో బాంబు పడేయడానికి రంగం సిద్ధమైంది. దాన్ని మింగేస్తరు. దాని తర్వాత తెలంగాణదే.
జవాబు : మేము ప్రజాస్వామిక వాదులం. నేను ఒక మాట చెప్తున్నా.. ఎన్నికల ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన. నిజంగా కూడా బీఆర్ఎస్ ఒకసారి ఓడిపోతే మంచిదే అని చెప్పిన. అప్పుడు తేడా తెలుస్తది.. మళ్లీ వెంటనే నెక్ట్స్ టర్మ్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తది. మనం ఇరవై ఏండ్లు నిశ్చింతంగా, కదలకుండా ఉంటామని చెప్పిన. ఎందుకంటే, ప్రజలకు మన విలువ తెలుస్తది అని చెప్పి. గాడిద ఉంటే కదా గుర్రం విలువ తెలుస్తది అని అన్న.
జవాబు: మేము ప్రజాస్వామికవాదులం. మేం గెలిచినప్పుడు బీజీపీ బాధ పెడితే బాధపడ్డాం. ఈ గవర్నమెంట్ ఐదేండ్లు ఉండాలని కోరుకుంటాం. అప్పుడే పూర్తి రంగు బయట పడ్తది. వీళ్ల శక్తి సామర్థ్యం, తెలివితేటలు అన్నీ బయటపడుతయి. అప్పుడు ఆటోమెటిక్గా బీఆర్ఎస్ బ్రహ్మాండంగా గెలుస్తుంది. కానీ, మీరు చెప్తున్న పరిస్థితి వస్తే సందర్భాన్ని బట్టి ఆలోచిస్తాం.
జవాబు: అట్లా ఎప్పుడూ అయిపోదు కదా.. అదే అజ్ఞానం అని అనేది. పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. అలా అయిపోలేదు కదా. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్నరు. మళ్లీ ఏపీ విభజన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అట్లా అనుకుంటరా ఎవరైనా? అట్లా అనుకోవడమే మూర్ఖత్వం. అదే మంచిది కాదు. ఆ పిచ్చి ప్రయత్నాలు బంద్ చేసి, మీరు ప్రజలకు ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చండి.