హైదరాబాద్ : హజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు చేశారు.
బీజేపీ పార్టీ అభ్యర్థి హుజురాబాద్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల లో డబ్బులు జమ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈటల రాజేందర్ అక్రమాలపై ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేశాం.
అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.