కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు నేడు. ఈ రోజును మేడేగా కార్మికులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మేడే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నిత్య శ్రామికులందరికి తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
అందరికీ మేడే శుభాకాంక్షలు! కష్టే ఫలి అనేది మన నానుడి.మనం పడే కష్టమే మనకి నిజమైన ప్రతిఫలాన్ని అందచేస్తుంది. నేను కూడా ఎప్పుడూ నమ్మే సిద్ధాంతం. శ్రమైక సౌందర్యాన్ని గుర్తుచేసే ఈ రోజున ప్రపంచంలోని నిత్య శ్రామికులందరికీ వందనాలు,అభివందనాలు అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తుండగా, ఇందులో ప్రజల కోసం పోరాడే నక్సలైట్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. మే 13న విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడింది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
ఇవికూడా చదవండి..