రంగారెడ్డి : జహంగీర్ పీర్ దర్గా విస్తరణకు 46 ఎకరాలు భూమిని సేకరించామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గాలో ఆదివారం నిర్వహించిన న్యాజ్ కార్యక్రమానికి ఆయన స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. దర్గా విస్తరణ, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 50 కోట్లు కేటాయించారని చెప్పారు. విస్తరణలో భాగంగా 46 ఎరాలు స్థలాన్ని సేకరించామని మరో 4 ఎకరాలు సేకరించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దర్గా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారయిందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Srsp Project : ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్ఫ్లో
ఎంగేజ్మెంట్ రింగ్తో స్టార్ క్రికెటర్
కామారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం