హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని అధికారులు మంగళవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికిది 6వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. వరి నాట్లు వేసేందుకు గాను నీళ్లను విడుదల చేయాలన్న ఆయకట్టు రైతుల కోర్కెను మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు.
సీఎం వెంటనే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. దీంతో మంగళవారం ఉదయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కుల నీళ్లను వదిలారు. దీని వల్ల నిజామాబాద్ జిల్లాలోని కొంత భాగం, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్,పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి, మంథని తదితర నియోజకవర్గాలలోని పంట పొలాలకు సమృద్ధిగా నీళ్లందుతాయి.
ఈ ఆయకట్టు కింది రైతులు వరి నాట్ల పనులను మరింత ముమ్మరం చేస్తారు. సకాలంలో నీళ్లను విడుదల చేయడం పట్ల సీఎం కేసీఆర్కు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు