గద్వాల,మార్చి 23: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో గోదాంలో ఉన్న ఈవీఎంలను పరిశీలించినట్ల్లు కలెక్టర్ శృతిఓఝా తెలిపారు. పీజేపీ క్యాంపు ఆవరణలో ఉన్న స్ట్రాంగ్ రూం తాళాలు మంగళవారం తెరిచి ఈవీఎంలు, వీవీ ప్యాట్లను, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో పరిశీలించామని కలెక్టర్ తెలిపారు. వీటి వివరాలను తెలపాలని ఎన్నికల సంఘం ఆదేశించగా వాటిని పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈఎంఎస్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో తాళాలు తెరవడాన్ని ఫోటో, వీడియో చిత్రీకరణ చేశామని కలెక్టర్ తెలిపారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో రాములు, సీ-సెక్షన్ అధికారి జయలక్ష్మి, బీజేపీ నాయకులు నర్సింహులు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అతికూర్ రెహమాన్తో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.