హుజూర్నగర్ టౌన్: పేద ఆడ బిడ్డల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబార్ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో లబ్ధి దారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన హుజూర్నగర్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు.
ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేస్తూ టెండర్లు పూర్తయిన పనులను అడ్డుకుని అధికారం కోసం పాకులాడుతున్నాయ న్నారు. రాజకీయాల్లో కాదు అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు గురవయ్య, ఉపేంద్ర, జడ్పీటీసీ సైదిరెడ్డి, తాసిల్దార్ జయశ్రీ, రెవెన్యూ సిబ్బంది, ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.