సూర్యాపేట : సీఎం కేసీఆర్ను చూసి కేంద్రంలోని బీజేపీ భయపడుతోందని హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు.
హుజూర్ నగర్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ట్యాంక్ బండ్ స్వప్నం రేపు నెరవేరబోతుందన్నారు.
బీజేపీ పార్టీ రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా కేవలం దళితులకు 12వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం 33 వేల కోట్లు కేటాయిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ దళిత బంధు లాంటి అద్భుత పథకాలను తెలంగాలో అమలు చేస్తున్నారని ప్రశంసించారు. జిల్లాలో రేపు జరగనున్న మంత్రి జగదీష్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.