మేళ్లచెర్వు, మే 31: మేళ్లచెర్వు-కోదాడ రహదారిలో (Mellacheruvu) మండల పరిధిలోని కందిబండ శివారులో ఉన్న వంతెన గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు కూలిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో వాహనాల రాకపోకలకుగాను వంతెన ప్రక్కన డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా వేసిన ఈ రోడ్డు ప్రక్కన రెయిలింగ్ లేకపోవడంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇక్కడ కారు, ఆటో పడిపోవడంతోపాటు ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తి.. కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.