సూర్యాపేట: ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు పలుమార్లు తమ సమస్యలు విన్నవించినప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయడంతోపాటు ప్రతి నెల 5వ తేదీ లోపే వేతనాలను చెల్లించాలన్నారు. బిక్షాటన చేసి పూట గడుపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ జీతాలను చెల్లిస్తే పండుగను ప్రశాంతంగా జరుపుకుంటామని తెలిపారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించడంతో దవాఖానలో రోగులకు వైద్య సేవల నిలిచిపోయాయి.
కాగా, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఔట్సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న మధు ఆత్మహత్యా యత్నం చేశారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ లైజాల్ తాగారు. దీంతో ఆయనను జనరల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ మధు