చిలుకూరు: రైతులు వడ్లు అమ్ముకోలేక ఇబ్బందలు పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాలక్షేపం కోసమే రైతు యాత్ర చేపడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని దూదియాతండాలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, బండి సంజయ్ కి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొంటుందా..? లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్కు చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొండా సైదయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా సురేష్బాబు, ఎంపీటీసీ కౄష్ణచైతన్య, సక్రు, వెంకటేశ్వర్లు, వస్తారాం, వాసు, తదితరులు పాల్గొన్నారు.