సూర్యాపేట: రోజువారి పనుల ఒత్తిడితో విసిగిపోయారా..! హాలిడేస్లో సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లమని పిల్లలు గోల చేస్తున్నారా..! బయట చూస్తే ధరలు పెరిగిపోయాయి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్న్యూస్..! అతి తక్కువ బడ్జెట్లో ఎంతో వినోదాన్ని అందించే సౌకర్యం అతి త్వరలో అందుబాటులోకి రానుంది.
సూర్యాపేటకు మణిహారంగా ఉన్న సద్దుల చెరువు టాంక్ బండ్లో బోటింగ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాలనే ఉద్దేశ్యంతో శాసనసభ్యుడిగా ఎంపికైన తరువాత మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. 2014కు ముందు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన సద్దుల చెరువును టాంక్ బండ్గా మార్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో లో ప్రజలకు ఉల్లాసాన్ని అందించేలా త్వరలోనే బోటింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు.