చిన్నశంకరంపేట,05 జూన్ : లాక్డౌన్ సమయంలో ఓ గర్భిణిని పోలీసులు తమ వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామానికి చెందిన గర్భిణి అనూష మెదక్లోని ఓ దవాఖానకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా చిన్నశంకరంపేటకు రాగానే ఒంటి గంట సమయం దాటడంతో ఆటోవాళ్లు శంకరంపేటలోనే దించివేసి వెళ్లిపోయారు. లాక్డౌన్ ఉండడంతో చేగుంట వరకు రాలేమని చెప్పారు. బస్టాండ్ వద్ద అనూష , తల్లి వాహనాల కోసం ఎదురుచూసుకుంటూ కూర్చుంది. చిన్నశంకరంపేటో ఎస్సై మహ్మద్గౌస్ తనిఖీలు చేస్తూ బస్టాండ్ వద్దకు వెళ్లగా ఇద్దరు మహిళలు కనబడడంతో ఎక్కడికి వెళ్లాలని వారిని ప్రశ్నించారు. వాహనాలు రాక తాము ఇంటికి వెళ్లలేక పోతున్నామని గర్భిణి పోలీసులకు తెలిపింది. వెంటనే ఎస్సై మహ్మద్గౌస్ వారిని పోలీసు వాహనంలో ఇంటికి చేర్చారు. లాక్డౌన్ సమయంలో తమను క్షేమంగా ఇంటికి చేర్చిన చిన్నశంకరంపేట ఎస్సై మహ్మద్గౌస్తో పాటు పోలీసు సిబ్బందికి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.