వరంగల్ అర్బన్ : కరోనా కాటుకు రెండు రోజుల వ్యవధిలోనే భార్య భర్తలు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఎల్కతుర్తి మండలం దామెరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గుండా రాజిరెడ్డి(80), అతని భార్య లక్ష్మి(75)కి వారం రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స కోసం చేరారు.
ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ఈ నెల 5న రాజిరెడ్డి మృతి చెందాడు. భర్త మృతి చెందాడనే బెంగతో లక్ష్మి సైతం శుక్రవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా మృతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే