Anshul Avijit : బీహార్లోని పట్నా సాహిబ్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. అక్కడి నుంచి లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అవిజిత్ను రంగంలోకి దించింది. అయితే పట్నా సాహిబ్ లోక్సభ స్థానం బీజేపీకి కంచుకోట. ప్రస్తుతం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2009, 2014 లోక్సభ ఎన్నికల్లో వరుసగా బీజేపీ అభ్యర్థి శతృఘ్న సిన్హా ఇక్కడి నుంచి 55 శాతం ఓట్లతో విజయం సాధించారు. 2019లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్ ఏకంగా 60 శాతం ఓట్లతో గెలిచారు. ఇప్పుడు బీజేపీ మరోసారి రవిశంకర్ ప్రసాద్నే ఇక్కడి నుంచి బరిలోకి దింపింది. బీజేపీ ఇంత బలంగా ఉన్న ఈ లోక్సభ స్థానంలో మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు అవిజిత్ కేంద్రమంత్రికి ఏ మేరకు పోటీ ఇస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.