Road Accident | సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం వద్ద ఆగివున్న లారీ కిందకు ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన కారు నంబర్ TS 04 FA 6894. కారులో ప్రయాణిస్తున్న వారు నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.