Dope Test : డోప్ పరీక్షలో అథ్లెట్లు పట్టుబడడం విన్నాం. కానీ, ఇప్పుడు క్రికెటర్లు సైతం ఫిట్నెస్ కోసం నిషేధిత డ్రగ్స్(Banned Drugs) వాడుతూ దొరకిపోతున్నారు. తాజాగా ఇద్దరు జింబాబ్వే క్రికెటర్లు(Zimbabwe Cricketers) డోప్ పరీక్షలో పట్టుబడ్డారు. ఆల్రౌండర్లు వెస్లీ మధేవెరె(Wessly Madhevere), బ్రాండన్ మవుతా(Brandon Mavuta) నిషేధిత డ్రగ్ తీసుకున్నారు. దాంతో, ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ ఇద్దరిని సస్ఫెండ్ చేసింది. విచారణకు హాజరయ్యేంత వరకూ క్రికెట్కు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది.
త్వరలోనే జింబాబ్వే క్రికెట్ బోర్డు క్రమశిక్షణ కమిటీ(Disciplinary Committee) ముందు వెస్లీ, మవుతా హాజరుకానున్నారు. అ కమిటీ ముందు వీళ్లు తమ వాదనలు వినిపిస్తారు. . అనంతరం ఈ ఇద్దరిపై ఎన్ని రోజుల నిషేధం విధిస్తారు అనేది కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
ZC suspends two players over recreational drug use
Details 🔽https://t.co/CS5pnD6aOO pic.twitter.com/Qy1kAjjU1P
— Zimbabwe Cricket (@ZimCricketv) December 21, 2023
ఇప్పటివరకూ వెస్లీ జింబాబ్వే తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 98 మ్యాచ్లు ఆడాడు. డిసెంబర్ 10న ఈ ఆల్రౌండర్ స్వదేశంలో ఐర్లాండ్(Ireland)తో చివరి టీ20 ఆడాడు. ఇక యంగ్స్టర్ మవుతా మాత్రం 26 వన్డే మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడంతే.