Team India : ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ నెగ్గిన భారత్(Team India) సొంతగడ్డపై తామెంత ప్రమాదకరమో మరోసారి చాటి చెప్పింది. కుర్రాళ్లతో కూడిన జట్టును రోహిత్ శర్మ(Rohit Sharma) అద్భుతంగా నడిపించగా.. రాంచీలో టీమిండియా సిరీస్ను ఛేజిక్కించుకుంది. అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ(Virat Kohli), ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara), అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలు లేకుండానే భారత జట్టు అద్భుతం చేసింది. కుర్రాళ్లు అత్యుత్తమంగా రాణించడంతో రోహిత్ సేన ఇంగ్లండ్కు మూడు చెరువుల నీళ్లు తాగించింది.
ఆల్రౌండ్ షోతో రఫ్ఫాడించి.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను పట్టేసి స్వదేశంలో వరుసగా 17వ సిరీస్తో టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ సిరీస్ విజయం టీమిండియాకు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. వ్యక్తిగత కారణాలతో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఐదో స్థానంలో ఇరగదీసే కేఎల్ రాహుల్(KL Rahul) గాయంతో తొలి మూడు మూడు టెస్టులు ఆడనే లేదు. ఉప్పల్ టెస్టులో గాయంతో జడేజా వైజాగ్ మ్యాచ్లో బరిలోకి దిగలేదు.
యశస్వీ జైస్వాల్
యశస్వీ, సర్ఫరాజ్ ఖాన్
శుభ్మన్ గిల్, జురెల్
ఇక బౌలింగ్ యూనిట్లో బుమ్రా లేకున్నా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) మూడు వికెట్లతో ఇంగ్లండ్ టాపార్డర్ను కూల్చాడు. ఆ తర్వాత అశ్విన్ తిప్పేయగా.. కుల్దీప్ యాదవ్ ఆల్రౌండర్గా అవతారమెత్తాడు. తొలి ఇన్నింగ్స్లో 28 పరుగులతో రాణించిన అతడు.. రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లతో విజృంభించాడు.
A fantastic victory in Ranchi for #TeamIndia 😎
India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d
— BCCI (@BCCI) February 26, 2024
కీలకమైన జాక్ క్రాలే(60), బెన్ స్టోక్స్(4)లను బౌల్డ్ చేసి ఇంగ్లండ్ను ఆటౌట్ ప్రమాదంలోకి నెట్టాడు. అనంతరం 192 ఛేదనలో 120 పరుగులకే సగం మంది పెవిలియన్ చేరగా.. గిల్, జురెల్ అసమాన పోరాటంతో భారత్ను విజయ తీరాలకు చేర్చారు. దాంతో, టీమిండియా స్వదేశంలో వరుసగా 17వ సిరీస్ విజయం నమోదు చేసింది.
ఆకాశ్ దీప్
ఈ సిరీస్తో సీనియర్లు లేకున్నా సరే.. కుర్రాళ్లతో నిండిన భారత జట్టును ఓడించడం అంత ఈజీ కాదని స్పష్టమైంది. అంతేకాదు టీమిండియాకు కుల్దీప్ రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్ దొరికాడు. నాలుగో స్థానంలో ధనాధన్ ఆడగల సర్ఫరాజ్ లభించాడు. ఇక మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni), రిషభ్ పంత్ల తర్వాత వికెట్ కీపర్గా రాణిస్తూనే.. ఫినిషర్గా అదరగొట్టగిలే సత్తా తనలో ఉందని జురెల్ చాటుకున్నాడు. అరంగేట్రం కుర్రాళ్లు అందరూ అద్భుతంగా ఆడినా.. రజత్ పాటిదార్ ఒక్కడే తీవ్రంగా నిరాశపరిచాడు. రాజ్కోట్ టెస్టులో ఫర్వాలేదనిపించినా.. రాంచీలో మాత్రం అతడు తేలిపోయాడు.
తొలి ఇన్నింగ్స్లో జో రూట్(122) సెంచరీతో 353 రన్స్ కొట్టిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో తడబడింది. అశ్విన్, కుల్దీప్ యాదవ్ తిప్పేయడంతో మూడో రోజు 145 పరుగులకే ఆలౌటయ్యింది. స్టోక్స్ సేన నిర్దేశించిన 192 పరుగుల ఛేదనలో ఓపెనర్లు యశస్వీ, రోహిత్ ధనాధన్ ఆడారు.