డోమినిక్: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal) సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్రం టెస్టులోనే అతను పరుగుల వరద పారించాడు. ఆట ముగిసే సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 312 రన్స్ చేసింది. యశస్వి జైస్వాల్ 143, కోహ్లీ 36 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇప్పటికే ఇండియా 162 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సూపర్ స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్న యశస్వి.. ఇప్పుడు విండీస్ టూర్లోనూ ఆ జోరును కొనసాగించాడు.
A special Debut ✨
A special century 💯
A special reception in the dressing room 🤗
A special mention by Yashasvi Jaiswal 👌🏻
A special pat on the back at the end of it all 👏🏻#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/yMzLYaJUvR— BCCI (@BCCI) July 14, 2023
ఇండియా తరపున తొలి టెస్టు ఆడుతున్న జైస్వాల్ .. తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్రం చేసిన టెస్టు మ్యాచ్లో అత్యధిక బాల్స్ ఆడిన ఇండియన్ బ్యాటర్గా కూడా జైస్వాల్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇండియా తరపున సెంచరీ చేసిన మూడవ ఓపెనర్గా జైస్వాల్ నిలిచాడు. గతంలో శిఖర్ ధావన్, పృథ్వీ షా ఓపెనర్లుగా ఆ రికార్డు అందుకున్నారు. మొత్తంమీద ఇండియా తరపున తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన 17వ బ్యాటర్గా నిలిచాడతను.
Dream Test debut for Yashasvi Jaiswal 🔥
How it happened ➡️ https://t.co/jNI9E8d0hO #WIvIND | #WTC25 pic.twitter.com/rsI2Ac6kgv
— ICC (@ICC) July 14, 2023
విండ్సర్ పార్క్లో జరుగుతున్న టెస్టులో.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీ చేశాడు. అతను 103 రన్స్ చేసి ఔటయ్యాడు. రోహిత్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. రోహిత్, జైశ్వాల్ మధ్య తొలి వికెట్కు అత్యధికంగా 229 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. నాటౌట్గా నిలిచిన జైస్వాల్ ఇన్నింగ్స్లో 14 బౌండరీలు ఉన్నాయి. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 150 రన్స్ ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.