Sreenivasa Prasad | కర్ణాటక బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. చామరాజనగర్ (Chamarajanagar) నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి (ex Union minister) వి.శ్రీనివాస ప్రసాద్ (Sreenivasa Prasad) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాసవిడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కాగా, చామరాజనగర్ నియోజకవర్గం నుంచి శ్రీనివాస ప్రసాద్ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. అదేవిధంగా మైసూరు జిల్లాలోని నంజన్గుడ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటన కూడా చేశారు. ఇక శ్రీనివాస ప్రసాద్ మరణ వార్త తెలుసుకున్న పలువురు పార్టీ పెద్దలు, రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.
1976లో బీజేపీలో చేరిన ఆయన.. 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కొంతకాలం పాటు జేడీయూ, జేడీఎస్, సమతా పార్టీల్లో కూడా పనిచేశారు. 1999 -2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయూ ప్రధానిగా ఉన్న సమయంలో శ్రీనివాస ప్రసాద్.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ 2016లో కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేశారు. అనంతరం తిరిగి బీజేపీలో చేరారు. ఆ తర్వాతి ఏడాది 2017లో నంజన్గుడ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అనంతరం 2019లో చామరాజనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
Also Read..
CM Arvind Kejriwal | కేజ్రీవాల్ను కలిసేందుకు సునీతకు అనుమతి నిరాకరణ
MP Prajwal Revanna | ‘సెక్స్ స్కాండల్’లో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్
Sound Pollution | ట్రాఫిక్ ధ్వనితో చికాకు మాత్రమే కాదు.. హృద్రోగ ముప్పు కూడా!