CM Arvind Kejriwal | న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యేందుకు ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్కు తీహార్ జైలు అధికారులు అనుమతిని నిరాకరించారు. షెడ్యూలు ప్రకారం వీరిద్దరి భేటీ సోమవారం జరగవలసి ఉంది. ఎటువంటి కారణం చూపకుండానే సునీతకు అనుమతిని తిరస్కరించారని ఆప్ వర్గాలు మీడియాకు తెలిపాయి.
అయితే ఢిల్లీ రాష్ట్ర మంత్రి, ఆప్ నేత ఆతిశీ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ను జైలులో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కేజ్రీవాల్ను కలిసేందుకు సునీత, ఆతిశీలకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారని, కానీ ఆ తర్వాత సునీతకు అనుమతిని తిరస్కరించారని ఆప్ వర్గాలు తెలిపాయి.