IND vs ENG 2nd Test : విశాఖపట్టణం టెస్టులో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 నాటౌట్ :156 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్లతో) శతకంతో గర్జించాడు. తొలి టెస్టులో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్న ఈ విధ్వంసక ప్లేయర్ వైజాగ్లో మూడంకెల స్కోర్ కొట్టేశాడు. లంచ్ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన యశస్వీ… స్పిన్నర్ టామ్ హర్ట్లే బౌలింగ్లో సిక్సర్తో శతకం బాదాడు.
దాంతో, టెస్టు ఫార్మాట్లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. సొంతగడ్డపై తొలి టెస్టు శతకం ఇదే కావడం విశేషం. యశస్వీ జోరుతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.
That moment when @ybj_19 got to his second Test 💯
Watch 👇👇#INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/Er7QFxmu4s
— BCCI (@BCCI) February 2, 2024
మరో ఎండ్లో శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులతో ఆడుతున్నాడు. దాంతో, టీమిండియా 50 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 175 రన్స్ కొట్టింది. శుభ్మన్ గిల్(34) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అయ్యర్తో యశస్వీ చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరూ మూడు వికెట్కు 86 రన్స్ జోడించి భారత్ను పటిష్ట స్థితిలో నిలిపారు.
4⃣4⃣4⃣ Yashasvi Jaiswal pushes the accelerator button #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 2, 2024
టస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 40 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. డెబ్యూ క్యాప్ అందుకున్న స్పిన్నర్ బషీర్ నాలుగో ఓవర్లోనే డేంజరస్ రోహిత్ శర్మ(14)ను ఔట్ చేసి ఇంగ్లండ్కు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం శుభ్మన్ గిల్(34), యశస్వీ ధాటిగా ఆడి రెండో వికెట్కు 49 రన్స్ జోడించారు. అయితే.. వెటరన్ పేసర్ అండర్సన్ సూపర్ డెలివరీతో 89 పరుగుల వద్ద గిల్ను బోల్తా కొట్టించాడు.