Mens Emerging Asia Cup : ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్(Mens Emerging Asia Cup)ను భారత ఏ జట్టు ఘనంగా ఆరంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధుల్(108 నాటౌట్ : 84 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) సంచలన బ్యాటింగ్తో జట్టను గెలిపించాడు. అతడికి నికిన్ జోస్(41 నాటౌట్) సహకారం అందించాడు. దాంతో, 175 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 26.3 ఓవర్లలోనే ఛేదించింది.
శ్రీలంకలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్(Sinhalese Sports Club)లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 9 వికెట్ల నష్టానికి 175 రన్స్ కొట్టింది. భారత పేసర్ హర్షిత్ రానా నాలుగు వికెట్లతో చెలరేగడంతో యూఏఈ ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ వల్తప చిందంబరం 46 పరుగులతో ఆదుకున్నాడు.
India ‘A’ win by 8️⃣ wickets 🙌
A clinical chase to secure the first win of the tournament 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/EOqtpUvxoE#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/ErwwpIJyBe
— BCCI (@BCCI) July 14, 2023
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన ఓపెనర్లు సాయి సుదర్శన్(8), అభిషేక్ శర్మ(19) తక్కువ స్కోర్కే ఔటయ్యారు.
నికిన్ జోస్(41 నాటౌట్), యశ్ ధుల్(108 నాటౌట్)
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ ధనాధన్ ఆటతో యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నికిస్ జోస్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే సెంచరీకి చేరువైన యశ్ వరుసగా రెండు బౌండరీలు కొట్టి జట్టును గెలిపించాడు.