Manika Batra | జెడ్డా: సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) గ్రాండ్ స్మాష్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. గురువారం ముగిసిన మహిళల సింగిల్స్ పోరులో మనిక.. 1-4 తేడాతో ప్రపంచ 14వ ర్యాంకర్ హినా హయట (జపాన్) చేతిలో పరాభవం పాలైంది. రెండో రౌండ్లో వరల్డ్ నంబర్ 2 వాంగ్ మన్యును ఓడించిన మనిక.. ప్రిక్వార్టర్స్లో మరో కఠిన ప్రత్యర్థి నీనా మెతెల్హమ్ (జర్మనీ)ని చిత్తుచేసి క్వార్టర్స్ చేరిన విషయం విదితమే.