Jyothi Yarraji | న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ యర్రాజీ జ్యోతి పసిడి పతకంతో మెరిసింది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న హ్యారీ స్కట్లింగ్ గేమ్స్లో బుధవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేసును జ్యోతి 12.87సెకన్లలో ముగించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ సీజన్ ఔట్డోర్ కాంపిటీషన్లో ఈ తెలుగు అథ్లెట్కు ఇది తొలి పతకం. కెరీర్లో నాలుగో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జ్యోతి..ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 26వ ర్యాంక్లో కొనసాగుతున్నది. పారిస్ ఒలింపిక్స్ 100మీ హర్డిల్స్లో పోటీపడనుంది.