మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఆందోళనకర ఘటన వెలుగు చూసింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఛేజింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47వ ఓవర్లో.. ఆ జట్టు 19 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. అలాంటి సమయంలో మిడ్వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ క్రీడాకారిణి షమీలియా కానెల్ ఉన్నట్టుండి పొట్ట పట్టుకొని నెమ్మదిగా కిందకు వంగింది. ఆ తర్వాత ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలింది.
దాంతో షాకైన మిగతా జట్టు సభ్యులు పరిగెత్తుకుంటూ ఆమె వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత జట్టు మెడికల్ టీం వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడంతో తేరుకున్న షమీలియా.. నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమెను అక్కడే అందుబాటులో ఉన్న అంబులెన్సులో దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. షమీలియా ఘటన జరిగినప్పటికీ విండీస్ జట్టు మంచి పట్టుదలతో ఆడి ఉత్కంఠ భరిత మ్యాచ్లో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో విండీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.
West Indies Women cricket’s Team player named Connell has collapsed, Hope she is fine. That was terrible. prayers for her. #CricketTwitter pic.twitter.com/8E8BvWRlyh
— Gujju (@TheBluesIndia_) March 18, 2022