దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు.. ఓపెనర్లు స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. షెఫాలీ రనౌట్గా వెనుతిరగడంతో వచ్చిన యాస్తికా భాటియా (2) నిరాశ పరిచింది.
అయితే కెప్టెన్ మిథాలీ రాజ్ (68), హర్మన్ప్రీత్ కౌర్ (48) అద్భుతంగా పోరాడారు. మిథాలీని కియాస్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన పూజా వస్త్రాకర్ (3), రిచా ఘోష్ (8) రాణించలేకపోయారు. చివరకు హర్మన్ప్రీత్ కూడా హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో అవుటైంది.
దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి భారత మహిళల జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. సఫారీ మహిళల్లో షాబ్రిమ్ ఇస్మాయిల్, మసాబట కియాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆయబోంగా ఖాకా, క్లో ట్రయాన్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత జట్టు సెమీస్ చేరాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి.
𝐈𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐁𝐫𝐞𝐚𝐤: After opting to bat first, India make 274-7 from 50 overs against South Africa. Shafali, Smriti and Mithali scored half-centuries while Harman made 48.
Details▶️ https://t.co/BWw8yYwlOS#TeamIndia | #CWC22 | #INDvSA pic.twitter.com/LrN0PcECSF
— BCCI Women (@BCCIWomen) March 27, 2022