INDvsSA: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఒక ఫార్మాట్ సిరీస్ను పూర్తిచేసింది. టీ20 సిరీస్ ముగియడంతో ఆదివారం నుంచి వన్డే సిరీస్ మొదలుకావాల్సి ఉంది. అయితే మూడు ఫార్మాట్ల టీమ్లలోనూ ఎంపికైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాత్రం పొట్టి ఫార్మాట్లో బెంచ్కే పరిమితమయ్యాడు. వన్డే సిరీస్లో అయినా అయ్యర్ను ఆడిస్తారా..? అంటే బీసీసీఐ మాత్రం లేదనే సమాధానం చెబుతున్నది. ఆదివారం జరిగే తొలి వన్డేకు మాత్రమే అయ్యర్ అందుబాటులో ఉంటాడని.. ఆ తర్వాత రెండు మ్యాచ్లలో అతడు ఆడడని తేల్చి చెప్పింది.
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య ఆదివారం జరుగబోయే తొలి వన్డేలో ఆడబోయే అయ్యర్.. తర్వాత అదే దేశంలో ఉన్న టెస్టు జట్టుతో కలుస్తాడు. టెస్టు సిరీస్ ప్రారంభానికి (డిసెంబర్ 26) ముందు భారత సీనియర్లు.. దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నారు. రోహిత్, విరాట్, అశ్విన్, బుమ్రా వంటి సీనియర్లు ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. వీళ్లతో పాటు అయ్యర్ను కూడా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది.
🚨📰| KKR captain Shreyas Iyer won’t be available for the 2nd and 3rd ODI as he will link up with the Test squad to prepare for the Test series after the 1st ODI.
(Cricbuzz) pic.twitter.com/Lrn3K93A3Z
— KnightRidersXtra (@KRxtra) December 16, 2023
ఎందుకు..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా భారత్ తొలి టెస్టును దక్షిణాఫ్రికాతో ఆడనుంది. గత రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్లో భారత్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈసారి అయినా డబ్ల్యూటీసీ ట్రోఫీని సొంతం చేసుకునేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. మిడిలార్డర్లో కీలకమైన అయ్యర్ను వన్డేల నుంచి తప్పించి టెస్టు జట్టులో చేర్చడానికి కూడా ఇదే కారణం. ప్రపంచకప్కు ముందు వెన్ను గాయం నుంచి కోలుకుని వరల్డ్ కప్లో తనదైన బ్యాటింగ్తో భారత మిడిలార్డర్కు వెన్నెముకలా నిలిచిన అయ్యర్.. టెస్టులలో కూడా కీలకపాత్ర పోషిస్తాడని బీసీసీఐ భావిస్తోంది. మరి అయ్యర్ ఏం చేసేనో…!