Shai Hope : వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్(Shai Hope) వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్(ODI World Cup Qualifier 2023)లో నేపాల్పై రికార్డు సెంచరీ బాదాడు. దాంతో అతను భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డు బద్ధలు కొట్టాడు. అవును… వన్డేల్లో వేగంగా 15 సెంచరీలు కొట్టిన మూడో ఆటగాడిగా హోప్ రికార్డుల్లోకి ఎక్కాడు. 105 ఇన్నింగ్స్ల్లో ఈ విండీస్ కెప్టెన్ ఈ ఫీట్ సాధించాడు. విరాట్ మాత్రం 106 ఇన్నింగ్స్ల్లో 15 శతకాలు కొట్టాడు. అంతేకాదు వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
హరారే స్పోర్ట్స్ క్లబ్(Harare Sports Club) వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన నేపాల్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, బ్యాటింగ్కు వచ్చిన విండీస్ కెప్టెన్ షై హోప్(132 129 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు), నికోలస్ పూరన్(115 94 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లు)తో కలిసి నేపాల్ బౌలర్లను ఉతికారేశాడు. వీళ్లిద్దరూ సెంచరీ కొట్టడంతో వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ, షై హోప్
ఒకప్పటి వరల్డ్ చాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంక(Srilanka) జట్లు ఈ ఏడాది వరల్డ్ కప్ క్వాలిఫైయర్ కోసం పసికూనలతో పోటీ పడుతున్నాయి. క్వాలిఫైయర్స్ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి. ఈ ఏడాది భారత గడ్డపై అక్టోబర్ 5న వరల్డ్ కప్ మొదలవ్వనుంది. 2011లో ఎంఎస్ ధోనీ(MS Dhnoi) సారథ్యంలో ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా భారత జట్టు కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.