India – Pak Football Teams : భారత్, పాకిస్థాన్ క్రికెట్(Cricket Match) మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. ‘నువ్వా నేనా’ అని తలపడే దాయాది జట్ల పోరు ఆటగాళ్లనే కాకుండా అభిమానులను సైతం మునివేళ్లపై నిలబెడుతుంది. భారత్, పాక్ మధ్య క్రికెట్ అనే కాదే ఏ ఆటైనా సరే తగ్గ పోరు ఉంటుంది. కొన్నిసార్లు ఆటగాళ్ల కవ్వింపులు, ఉద్వేగపూరిత క్షణాలు మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చేస్తాయి. తాజాగా అలాంటి సంఘటనే భారత్, పాకిస్థాన్ ఫుట్బాల్ జట్ల మధ్య జరిగింది.
బెంగళూరులో బుధవారం రాత్రి జరిగిన శాఫ్(SAFF) చాంపియన్షిప్ మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే..? పాక్ ఆటగాడు అబ్దుల్లా ఇక్బాల్(Abdullah Iqbal) బంతిని తన్నే సమయంలో.. భారత మేనేజర్ ఇగొర్ స్టిమాక్(Igor Stimac) అతడిన నుంచి బంతిని తీసుకున్నాడు.
Whether it is cricket Or football, the match between India and Pakistan is always on 🔥#IndianFootball #INDvsPAK #indpic.twitter.com/1Y4s4qhsyR
— Hari (@Harii33) June 21, 2023
స్టిమాక్ తీరును వ్యతిరేకిస్తూ పాక్ ప్లేయర్స్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో, మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే.. మ్యాచ్ రిఫరీ స్టిమాక్కు రెడ్ కార్డ్() చూపించాడు. దాంతో, పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఈ మ్యాచ్లో భారత్ 4-0తో పాక్ను చిత్తు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో టీమిండియా అలవోకగా గెలిచింది. హ్యాట్రిక్ గోల్స్తో ఛెత్రీ కెరీర్ గోల్స్ సంఖ్య 90కి చేరింది. దాంతో, అంతర్జాతీయ మ్యాచ్లో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆసియా ఫుట్బాలర్గా అతను రికార్డు సాధించాడు. ఇరాన్ ఆటగాడు అలీ దాయి(Ali Daei) 109 గోల్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు.