న్యూఢిల్లీ, జూలై 30: జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. స్వల్ప చర్చ తర్వాత గందరగోళం మధ్య లోక్సభ ఈ చట్టాన్ని ఆమోదించింది. దేశ గౌరవానికి అవమానాలను నిరోధించే (సవరణ) బిల్లు, 2026ను ఒక రోజు ముందు బుధవారం రాజ్యసభ ఆమోదించింది.
ఇప్పుడు దిగువ సభలో కూడా ఆమోదించడంతో త్వరలోనే ఇది చట్టరూపం దాల్చనున్నది. ఈ బిల్లు ప్రకారం వందేమాతర గేయం ఆలపిస్తున్నప్పుడు ఆటంకాలు సృష్టించినా, అడ్డుకున్నా అదే మాదిరిగా మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు. నీట్ లీక్పై విపక్షాలు ఆందోళన కొనసాగిస్తుండగా, ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.