Virat Kohli : ప్రపంచ క్రికెట్లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరు ఓ సంచలనం. వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023)లో 50వ సెంచరీతో దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డు బద్ధలు కొట్టిన విరాట్ తన మార్క్ ఇన్నింగ్స్లతో అభిమానులను అలరించాడు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు దూరమైనప్పటికీ కోహ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(RPSC) తాజాగా నిర్వహించిన ఓ పరీక్షలో ఈ స్టార్ బ్యాటర్పై ప్రశ్న వచ్చింది.
వన్డేల్లో 10 వేల పరుగులు బాదిన 13 బ్యాటర్ కోహ్లీ.. 210 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ 10 రన్స్ మైలురాయికి చేరుకున్నాడు అని ఆప్షన్స్ ఇచ్చి.. ఈ రెండింటిలో ఏది సరైనది? అని అడిగారు. ముఫద్దల్ వొహ్రా అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
A question related to King kohli in the Rajasthan Public Service Commission. pic.twitter.com/SqdVAscWLl
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2024
అండర్ 19 వరల్డ్ కప్ హీరోగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ ఫార్మాట్లతో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. 2022 ఆసియా కప్లో ఫామ్ అందుకున్న అతడు టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ 16వ సీజన్లో చితక్కొట్టాడు. నిరుడు సొంతగడ్డపై ఈమధ్యే ముగిసిన వన్డే వరల్డ్కప్లో ఈ ఛేజ్ మాస్టర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు.
విరాట్ కోహ్లీ
వరల్డ్ కప్ ఫామ్తో విరాట్ 14 ఏండ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. మరో నాలుగు నెలల్లో వెస్టిండీస్, అమెరికాలో జరిగే పొట్టి ప్రపంచకప్లో కీలకం కానున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో కీలక ఇన్నింగ్స్లు ఆడిన విరాట్.. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. రాజ్కోట్లో జరిగే మూడో టెస్టుకు ముందు కింగ్ కోహ్లీ జట్టుతో కలువనున్నాడు.