IND vs ENG : తొలి టెస్టులో లంచ్ తర్వాత తడబడిన ఇంగ్లండ్(England) జట్టు టీ సమయానికి 215 స్కోర్ చేసింది. భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభణతో.. ఒకదశలో రెండొందల లోపే ఆలౌట్ అవుతుందునుకున్న జట్టును బెన్ స్టోక్స్(9) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మార్క్ వుడ్(7 నాటౌట్), టామ్ హర్ట్లే(23)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దాంతో, టీ టైమ్కి ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు కొట్టింది.
Axar and Jadeja have done plenty of damage, but as long as Stokes is in, India won’t be comfortable #INDvENG
▶️ https://t.co/ScJisUw7M1 pic.twitter.com/94rLFyWlBh
— ESPNcricinfo (@ESPNcricinfo) January 25, 2024
సొంతగడ్డపై బాజ్ బాల్ ఆటతో యాషెస్ సిరీస్ సమం చేసుకున్న ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై తేలిపోయింది. లంచ్ లోపే ఓపెనర్లు ఓపెనర్లు జాక్ క్రాలే(18), బెన్ డకెట్(35)లతో పాటు ఓలీ పోప్(1)లు ఔటయ్యారు. లంచ్ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో జానీ బెయిర్స్టో(37) బౌల్డ్ కాగా.. జడ్డూ బౌలింగ్లో జో రూట్(29) స్వీప్ షాట్ ఆడి వెనుదిరిగాడు. దాంతో, 137 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. టామ్ హర్ట్లే ధనాధన్ ఆడి స్టోక్స్పై ఒత్తిడిని తగ్గించాడు. అతడు ఔటయ్యాక గేర్ మార్చిన స్టోక్స్ జడేజా ఓవర్లో మూడు ఫోర్లతో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.