హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport) సమీపంలో చిరుతపులి(Leopard )ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. చిరుతపులి ఆనవాళ్లను గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిమిచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు(Forest officials) సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విమానాశ్రయ పరిసరాలను పరిశీలించారు.
చిరుతపులి లేదా అడవి పిల్లి సంచరిస్తుందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. కాగా, గతంలో కూడా అడవి పిల్లి సంచరించడంతో చిరుత అనుకొని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు విచారణ వేగవంతం చేసి అనుమానాలను నివృత్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.