VHP leader Sharad Sharma : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం సాధారణ భక్తులకు ప్రవేశం కల్పించిన క్రమంలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. రామాలయానికి కోట్లాది రూపాయల విరాళాలు వచ్చాయని వీహెచ్పీ నేత శరద్ శర్మ గురువారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా భక్తులు రాముడి దర్శనం కోసం అయోధ్యకు తరలివస్తున్నారని, వారంతా డబ్బు, బంగారం, వెండిని విరాళాలుగా సమర్పిస్తున్నారని శర్మ పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిరం లక్ష్మీదేవీ ఆశీస్సులతో నిత్యం సుసంప్నంగా ఉంటుందని అన్నారు. రాముడు విష్ణువు యొక్క అవతారమని, అతని భార్య లక్ష్మీ దేవి కావడంతో అయోధ్యలోని రామమందిరం ఆర్థిక బలహీనతను ఆమె ఎప్పుడూ కోరుకోదని అన్నారు.
రామాలయానికి వచ్చిన భక్తులు ఏదో ఒక రూపంలో సాయం చేస్తున్నారని కొందరు డబ్బు, పప్పుధాన్యాలు, వస్తవులు, బంగారం, వెండి వంటి ఆభరణాలను విరాళంగా సమకూరుస్తున్నారని వీహెచ్పీ నేత చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే భక్తులు కోట్లాది రూపాయలు విరాళాలు అందచేశారని అన్నారు. రామ మందిరం ఆర్ధిక సౌభాగ్యాన్ని తీసుకువస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ ద్వారా అందిన మొత్తాన్ని బ్యాంకులు లెక్కిస్తున్నాయని అన్నారు.
Read More :
USA-UK | అమెరికా, బ్రిటన్ మధ్య చిచ్చు రాజేసిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ సలహా.. అసలేం జరిగిందంటే?