ములుగు : దళితబంధు( Dalitha Bandhu) పథకం అమలులో జాప్యంపై దళితలోకం ఆందోళన చెందుతున్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడుస్తున్నా రెండో విడత డబ్బులను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ గురువారం ములుగు(Mulugu) జిల్లా కేంద్రంలోని గాంధీ వద్ద విగ్రహం లబ్ధిదారులు ధర్నా(Dharna) చేపట్టారు.
దళితబంధు నిధుల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని లబ్ధిదారులు మండి పడ్డారు. దళిత బంధు అమలు చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దళిత సంఘాల నాయకులు ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు మద్దతు తెలిపారు.