IPL 2024 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి భారీ ఫైన్ పడింది. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో విరాట్ అంపైర్తో గొడపడ్డాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బీసీసీఐ.. విరాట్కు మ్యాచ్ ఫీజులో ఏకంగా 50 శాతం కోత విధించింది. ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఐపీఎల్(IPL Code Of Conduct) నియమావళిని ఉల్లంఘించాడు. ఈ విషయాన్ని రిఫరీ బీసీసీఐకి నివేదించాడు. అంతేకాదు కోహ్లీ సైతం తన తప్పును అంగీకరించాడు. మొదటి స్థాయి పొరపాటుకు పాల్పడినందున రన్ మెషీన్కు మ్యాచ్ ఫీజులో సగం డబ్బులు జరిమానాగా విధించారు.
కోల్కతాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. కోల్కతా నిర్దేశించిన భారీ ఛేదనలో 18 పరుగులతో ఆడున్న విరాట్ హర్షిత్ రానా(Harshit Rana) బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే.. హర్షిత్ వేసిన హై ఫుల్టాస్ బంతిని నో బాల్ ఇవ్వకపోవడంతో కోహ్లీ నేరుగా అంపైర్తో గొడవకు దిగాడు. ఆ బంతిని నో బాల్గా ప్రకటించాల్సిదని చెప్పాడు. కానీ, అంపైర్ వినలేదు .
.@KKRiders start strongly with wickets of both the openers!#RCB 45/2 after 4 overs in the chase
Follow the Match ▶️ https://t.co/hB6cFsk9TT#TATAIPL | #KKRvRCB pic.twitter.com/CqtYALz51S
— IndianPremierLeague (@IPL) April 21, 2024
దాంతో, విరాట్ అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగాడు. పెవిలియన్కు వెళ్తూ వెళ్తూ డస్ట్బిన్ను బ్యాటుతో కొట్టాడు. ఈ ఉదంతాన్ని మ్యాచ్ రిఫరీ తీవ్రంగా పరిగణిస్తూ పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో, మ్యాచ్ అనంతరం కోహ్లీని విచారించిన బీసీసీఐ, ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ విరాట్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేసింది.
కోల్కతా నిర్దేశించిన 222 పరుగుల ఛేదనలో ఆర్సీబీ చివరి ఓవర్ వరకూ పోరాడింది. ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. కరన్ శర్మ ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. దాంతో, మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. అయితే.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన కోల్కతా ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు ఆర్సీబీ ఏడో ఓటమితో అట్టడుగుకే పరిమితమైంది.
📽️ WATCH: A jaw-dropping finish!
The final delivery that sealed the win for the @KKRiders 👏👏
Scorecard ▶️ https://t.co/hB6cFsk9TT#TATAIPL | #KKRvRCB pic.twitter.com/BR5RYrOeDM
— IndianPremierLeague (@IPL) April 21, 2024