Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 1000 మందికిపైనే గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాద బాధితులకు, మృతుల కుటుంబాలకు కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు రైలు ప్రమాద బాధితులకు (Odisha Train Accident Victims) ప్రభుత్వాలే కాకుండా.. సెలబ్రిటీలు, క్రికెటర్లు భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ (MS Dhoni) ఒడిశా రైలు బాధితులకు రూ.60 కోట్లు విరాళంగా అందించినట్లు పలు వెబ్సైట్స్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. తాజాగా టీంఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ), జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma ) కూడా రైలు ప్రమాద బాధితులకు భారీగా విరాళం ఇచ్చినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒడిశా సహాయ నిధికి కోహ్లీ రూ.30 కోట్లు డొనేట్ చేయగా.. రోహిత్ రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చాడంటూ నెట్టింట, పలు వెబ్సైట్లలో వార్త హల్చల్ చేస్తోంది. అయితే ఇందులో కూడా నిజం లేదని తెలుస్తోంది.
There is a news that there has been an Odisha train accident, Rohit Sharma donated 15 crores to the families of those who died in the accident. pic.twitter.com/amFQmOoRhL
— SAI (@TheNameIsSaiii) June 6, 2023
Also Read..
Tractor Crushes Car | కారుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. షాకింగ్ వీడియో
Odisha Train Accident | పరిహారం కొట్టేసేందుకు కొత్త తరహా మోసం.. చనిపోయింది మా వాళ్లే అంటూ డ్రామాలు