Asia Cup 2023 | ఆసియాకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వరుణుడు పలుమార్లు అంతరాయం కల్పించగా.. ఆదివారం 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్కు రిజర్వ్ డే ఉండటంతో.. అక్కడి నుంచే సోమవారం తిరిగి ఆట ప్రారంభించారు. అయితే ఈ రోజు కూడా వాతావరణం సహకరించకపోవడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆట నిర్ణీత సమయానికి మొదలు కాకపోగా.. భారత ఆటగాళ్లు సరదాగా గడుపుతూ కనిపించారు. ఇందులో భాగంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సూర్యాకుమార్ యాదవ్కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
వీరిద్దరూ ఆకాశం వైపు తదేకంగా చూడటంతో పాటు చేతులతో చూపిస్తూ.. ఏదో సీరియస్గా ముచ్చటించుకుంటున్న వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. క్రీడా విశ్లేషకులు, అభిమానులు, కామెంటేటర్లు సూర్యకుమార్ యాదవ్ ను ముద్దుగా ‘స్కై’ అని పిలుచుకోవడం పరిపాటి కాగా.. ‘స్కై ఎక్కడికి వస్తున్నావు. కాస్త పక్కకు తప్పుకోవచ్చు కదా మేం మ్యాచ్ ఆడుకుంటాం’ అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. ‘నా చిన్నప్పుడు ఆకాశంలో నుంచి హెలికాప్టర్లు పోతే ఇలాగే చూసేవాడిని’ అని మరొకరు వ్యాఖ్యానించారు. కొందరైతే మరో అడుగు ముందుకు వేసి అరుంధతి నక్షత్రం కనిపించిందా అని కామెంట్స్ చేశారు.
వర్షం తెరిపినిచ్చినా.. పిచ్ ఆటకు సిద్ధం చేయడం కష్టమే అని అంతా భావించగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం హాలోజన్ లైట్ల సాయంతో పిచ్పై తేమను ఆరబెట్టింది. ప్రత్యేక మైన వాహనానికి లైట్లు అమర్చి దాన్ని పిచ్పై తిప్పుతూ ఆటకు సిద్ధం చేశారు. దీన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తిగా గమనించగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలు చక్కర్లు కొడుతున్నది. ఇక వరుసగా రెండు రోజుల పాటు సాగిన దాయాదుల పోరులో కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది.
This is literally me & my homies on the eve of Eid, trynna look for Moon. 😭😭#AsiaCuppic.twitter.com/OdbzVmKUPS
— Waѕiyullah Budye (@WasiyullahB) September 10, 2023