Income Tax | న్యూఢిల్లీ, మే 18: ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనల ప్రకారం.. పాత, కొత్త పన్ను విధానాల్లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు రూ.25,000 వరకు రాయితీని పొందే వెసులుబాటున్నది. ఐటీ చట్టంలోని సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటు ఈ దేశంలో నివసిస్తున్న ట్యాక్స్పేయర్లకు లభిస్తుంది.
పాత పన్ను విధానంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.5 లక్షలు దాటనైట్టెతే.. సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేటును పొందవచ్చు. ఈ విధానంలో రూ.2.50 లక్షల వరకు ఏ పన్నూ లేదన్న విషయం తెలిసిందే. మిగతా రూ.2.50 లక్షలకు 5 శాతం పన్ను పడుతుంది. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి ఇది రూ.12,500 పన్నుకు సమానం. దీంతో ఈ మొత్తాన్ని సెక్షన్ 87ఏ కింద రిబేటుగా క్లెయిం చేసుకోవచ్చు. ఒకవేళ వార్షిక ఆదాయం రూ.4 లక్షలే ఉంటే ట్యాక్స్ రిబేటు రూ.7,500గానే ఉంటుంది. మొత్తంగా చూసినైట్టెతే ఈ విధానంలో ట్యాక్స్ రిబేటు ఎంతైనా తగ్గుతుందిగానీ, రూ.12,500 మాత్రం దాటదు.
సెక్షన్ 115బీఏసీ(1ఏ) కింద కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న ట్యాక్స్ పేయర్స్కు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.7 లక్షలు దాటనైట్టెతే.. సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేటును అందుకోవచ్చు. నిజానికి గతంలో రూ.5 లక్షల వరకే ఈ ప్రయోజనం అందుబాటులో ఉన్నది. కానీ 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను దీన్ని రూ.7 లక్షలకు పెంచారు. ఇక కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ లేదు. ఒకవేళ వార్షిక ఆదాయం రూ.7 లక్షలుగా ఉంటే.. ఆ మిగతా రూ.4 లక్షలకు రూ.25,000 పన్ను రిబేటు లభిస్తుంది. తొలి రూ.3 లక్షలకు 5 శాతం చొప్పున రూ.15,000, ఆ తర్వాతి లక్ష రూపాయలకు 10 శాతం చొప్పున రూ.10,000. మొత్తం రూ.25,000 రాయితీ అందుకోవచ్చు. అయితే వార్షిక ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం రిబేటు లభించదు.